AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దారుణం.. తల్లి పక్కలోనుంచి మాయమై.. వాటర్ ట్యాంకులో శవమై తేలిన పసికందు..

Boy Suspicious Death: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదెండ్ల మండ‌లం సంక్రాంతిపాడు గ్రామంలో ఆరునెలల బాబు

Crime News: దారుణం.. తల్లి పక్కలోనుంచి మాయమై.. వాటర్ ట్యాంకులో శవమై తేలిన పసికందు..
Baby
Shaik Madar Saheb
|

Updated on: Dec 02, 2021 | 2:22 PM

Share

Boy Suspicious Death: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదెండ్ల మండ‌లం సంక్రాంతిపాడు గ్రామంలో ఆరునెలల బాబు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి తల్లి పక్కలో నిద్ర పోతున్న ఆరునెలల బాబు కన్పించలేదు. దీంతో తల్లి బాబు కనిపించడం లేదని అత్తమామాలకు చెప్పింది. అయితే బాబు ఇంటి ఎదుట ఉన్న వాటర్ పీపాలో శవమై కనిపించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన గోపి, ఝాన్సీ కొంతకాలం నుంచి ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే లో ఇద్దరూ కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపి విజయవాడలోని ఓ సెల్ షాపులో పని చేస్తుండగా ఝాన్ని ఇంటిలోనే ఉంటుంది. నవంబర్‌లో ఝాన్సి నెలలు నిండకముందే బాబుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రి ఖర్చుల కోసం లక్షన్నర వరకూ ఖర్చు చేశారు. అయితే.. గోపి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ చికిత్స చేయిస్తూ వస్తున్నాడు.

అయితే.. బుధవారం రాత్రి తల్లి పక్కలో మాయమై వాటర్ పీపాలో శవమై కన్పించిన బాలుడి మృతి ఘటన వెనుక కుటుంబ సభ్యుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేకే అత్త లక్ష్మీ బాలుడిని వాటర్ పీపాలో పడేసి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన నర్సరావు పేట డీఎస్పీ విజయ బాస్కర్ మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు నాదేండ్ల పోలీసులు తెలిపారు.

Also Read:

Viral news: కారు అద్దానికి చుట్టేసుకున్న కొండ చిలువ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

DH Srinivas Rao: బ్రిటన్ నుంచి హైదరాబాద్‎కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు.. జినోమ్ సీక్వెన్స్‎కు శాంపిల్స్..