AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోధన్‌‌లో దారుణం..చెల్లిపైనే అత్యాచారం..5 నెలల గర్భం

ఎన్ని శిక్షలు వేస్తోన్నా, ఎన్ని చట్టాలు తెస్తోన్నా..స్త్రీ సమాజంపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా సమజంలో ఎటువంటి మార్పులు తీసుకురావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణ సంఘటన జరిగింది. ఓ కామాంధుడు బాబాయ్ కుమార్తెపై..స్నేహితుడితో కలిసి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీటీ నగర్‌లో నివశించే 19 ఏళ్ల […]

బోధన్‌‌లో దారుణం..చెల్లిపైనే అత్యాచారం..5 నెలల గర్భం
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2019 | 9:22 AM

Share

ఎన్ని శిక్షలు వేస్తోన్నా, ఎన్ని చట్టాలు తెస్తోన్నా..స్త్రీ సమాజంపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా సమజంలో ఎటువంటి మార్పులు తీసుకురావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణ సంఘటన జరిగింది. ఓ కామాంధుడు బాబాయ్ కుమార్తెపై..స్నేహితుడితో కలిసి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీటీ నగర్‌లో నివశించే 19 ఏళ్ల యువతి 10వ తరగతి అనంతరం చదువు మానేసింది. స్పల్ప వైకల్యం ఉండటంతో ఆమెను ఇంటి దగ్గర ఉండమని చెప్పి తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్లేవారు. దీంతో ఒంటిరిగా ఉన్న యువతిపై ఆమె పెదనాన్న కొడుకు నవీన్‌(25), స్నేహితుడు రవి(22)  బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఆమె శరీరంలో మార్పులు రావడంతో విషయాన్ని తల్లిదండ్రులు పసిగట్టగలిగారు. ప్రస్తుతం యువతి 5 నెలల గర్భిణి. కుల పెద్దలు విషయం బయటకు పొక్కకుండా రాజీ చేసే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన పోలీసు సిబ్బంది..పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.