Crime News: దారుణం.. వాటి కోసం ఏకంగా మహిళ పాదాలు నరికి చంపిన దుర్మార్గుడు..

Rajasthan Shocker: రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెండి కడియాల కోసం ఓ కిరాతకుడు మహిళ కాళ్లు నరికి చంపాడు. ఈ ఘటన రాజ్ సమంద్ జిల్లాలోని

Crime News: దారుణం.. వాటి కోసం ఏకంగా మహిళ పాదాలు నరికి చంపిన దుర్మార్గుడు..
Crime News
Follow us

|

Updated on: Nov 17, 2021 | 2:05 PM

Rajasthan Shocker: రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెండి కడియాల కోసం ఓ కిరాతకుడు మహిళ కాళ్లు నరికి చంపాడు. ఈ ఘటన రాజ్ సమంద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. రాజ్‌సమంద్ జిల్లా చార్‌భుజా పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. పొలంలో 45 ఏళ్ల కుంకుబాయి అనే మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. రెండు పాదాలు కూడా నరికి వేశారని.. పోలీసులు తెలిపారు. మహిళ ధరించిన వెండి కడియాలను దొంగిలించేందుకు ఓ దొంగ ఆమె పాదాలను నరికి చంపినట్లు చార్భుజా పోలీసులు తెలిపారు. నిందితులు మొదటగా మహిళ మెడపై కత్తితో దాడి చేశారని, ఆ తర్వాత కాళ్లు నరికారని.. దీంతో మహిళ మృతి చెందిందని రాజ్‌సమంద్ ఎస్పీ శివలాల్ తెలిపారు. కంకుబాయిగా పొలంలో పనిచేస్తున్న తన భర్త కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొని వస్తుండగా ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు.

భర్తకు భోజనం తీసుకెళ్లిన మహిళ పొలానికి చేరుకోలేదు. దీంతో భర్త ఇంటికి తిరిగి వచ్చి అతను పిల్లలను అడగ్గా.. ఆమె ఉదయాన్నే పొలానికి భోజనం తీసుకొని వచ్చినట్లు తెలిపారు. దీంతో బంధువులు, స్థానికులు గాలించగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహం పొలంలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మహిళను కిరాతకంగా హత్య చేసి కడియాలను దొంగలించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శివలాల్ తెలిపారు. గతంలో కూడా ఓ మహిళ పాదాలు నరికి చంపిన ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జైపూర్‌లో పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ దాడి చేసిన దొంగలు.. ఆమె పాదాలను నరికి వెండి కడియాలను తీసుకెళ్లారు.

Also Read:

Weird News: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ.. దాని రుచి అలా ఉందంటూ.. షాకింగ్ విషయాలు

అందమంతా కళ్ళలోనే ఉందా..! తీక్ష్ణమైన చూపుతో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ..

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.