AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Bomb Attack: పాకిస్థాన్‌లో ఊరేగింపుపై బాంబు దాడి.. ముగ్గురు దుర్మరణం.. 50మందికి పైగా తీవ్ర గాయాలు

పాకిస్థాన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Pakistan Bomb Attack: పాకిస్థాన్‌లో ఊరేగింపుపై బాంబు దాడి.. ముగ్గురు దుర్మరణం.. 50మందికి పైగా తీవ్ర గాయాలు
Pakistan Bomb Attack
Balaraju Goud
|

Updated on: Aug 19, 2021 | 6:22 PM

Share

Pakistan Bomb Blast: పాకిస్థాన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మధ్య పాకిస్థాన్‌లో గురువారం షియా ముస్లిం ఊరేగింపులో బాంబు పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

పవిత్రమైన ముహర్రం మాసంలో మతపరమైన ఊరేగింపు జరుగుతుండగా, ముష్కరులు బాంబులతో దాడి చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌నగర్ నగరంలో ఈ ఘటన జరిగిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పేలుడు ధాటికి పదుల సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మిగిలారని తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని స్థానికులు సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడు స్వభావం ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ఇదిలావుంటే, ఆషూరా ఊరేగింపుల సమయంలో భద్రతా చర్యగా అధికారులు ప్రధాన నగరాల్లో మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేశారు. అనేక పట్టణ కేంద్రాలలో నివాసితులు గురువారం సెల్ ఫోన్ సిగ్నల్ జామ్‌లను ఎదుర్కొంటున్నారు. ఊరేగింపు మార్గాలకు వెళ్లే వీధులు కూడా బ్లాక్ చేశారు. పాకిస్థాన్ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఉన్న తర్వాత ఊరేగింపు తిరిగి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

పాకిస్తాన్‌లో 220 మిలియన్ల మంది జనాభాలో దాదాపు 20 శాతం ఉన్న షియాలకు వ్యతిరేకంగా సన్నీ హార్డ్‌లైనర్లచే మతపరమైన హింస – దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో షియా వ్యతిరేక సమూహాలు పుణ్యక్షేత్రాలపై బాంబు దాడి చేశాయి. ఆషురా ఊరేగింపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి ఉంటారని అధికారులు తెలిపారు.

Read Also…  Whatsapp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి.. ఇకపై ఆ పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు..! వీడియో

Dog Sniffs Murders: ఈ జాగిలం చాలా ఫాస్ట్.. ఆరుగురు నరహంతకులను అర్ధ గంటలో పట్టించిన పోలీస్‌ శునకం.