AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..

One dead, five injured: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మాజీ సర్పంచ్‌ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 05, 2021 | 1:12 PM

Share

One dead, five injured: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మాజీ సర్పంచ్‌ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురుగ్రామ్‌లోని మనేసర్ ప్రాంతంలోని కసన్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మాజీ సర్పంచ్‌ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో దీపావళి పూజలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అందరిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, 8 ఏళ్ల చిన్నారితోసహా మరో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను రక్షించే ప్రయత్నంలో పెంపుడు కుక్క కూడా కాల్పుల్లో గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై పటౌడీ పోలీసు సూపరింటెండెంట్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్‌ కుటుంబంపై దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. రింకూ అనే వ్యక్తి కుటుంబంతో ఈ కుటుంబానికి కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వారే ఈ దాడికి పాల్పడ్డాడని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం గాలిస్తు్న్నట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన వారిని మేదాంత ఆసుపత్రిలో చేర్పించామని.. చికిత్స కొనసాగుతుందని తెలిపారు.

Also Read:

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..