Odisha Car Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం… బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

బాలాసోర్ జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారి వంతెనపై నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పడిపోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

Odisha Car Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం...  బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
Car Falls Off The Bridge In Balasore
Follow us

|

Updated on: May 15, 2021 | 10:20 AM

Odisha Car Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బ్రిడ్జిపై నుంచి కింద పడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బాలాసోర్ జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారి వంతెనపై నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పడిపోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. క్షత‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం బాలసోర్ డిహెచ్‌హెచ్‌కి త‌ర‌లించారు. మృతుల‌ను య‌మూర్భంజ్ జిల్లాకు చెందిన‌వారిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

బరిపాడ నుండి భువనేశ్వర్‌కు కారు వేగంగా వెళుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వంతెనపై నుంచి పడిపోయాడు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

Read Also…. Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇటుక బట్టీ కార్మికుడి గొంతు కోసి హతమార్చిన గుర్తుతెలియని దుండగులు