షాకింగ్.. నిర్భయ దోషుల ఉరికి మళ్లీ బ్రేక్..?ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఉత్కంఠ..
నిర్భయ కేసులో దోషుల శిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. దోషులు ఉరితీత నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతునే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. ఈ నెల 16న తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్వల్ప గాయాలైన వినయ్ శర్మకు.. చికిత్స అందించామని జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అతని తరఫు లాయర్ మాత్రం మరోలా చెప్తున్నారు. ఫిబ్రవరి 16న జరిగిన సంఘటనలో వినయ్ శర్మ చేతి భుజం విరిగడంతో […]
నిర్భయ కేసులో దోషుల శిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. దోషులు ఉరితీత నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతునే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. ఈ నెల 16న తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్వల్ప గాయాలైన వినయ్ శర్మకు.. చికిత్స అందించామని జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అతని తరఫు లాయర్ మాత్రం మరోలా చెప్తున్నారు. ఫిబ్రవరి 16న జరిగిన సంఘటనలో వినయ్ శర్మ చేతి భుజం విరిగడంతో పాటుగా.. తలకు బలమైన గాయాలయ్యాయని.. దీంతో కనీసం తన తల్లితోపాటు ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతున్నాడని వినయ్ శర్మ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వినయ్ శర్మకు మానసిక వైద్య కేంద్రంలో మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు తన క్షమాభిక్ష పిటిషన్పై ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసినట్లు వినయ్శర్మ న్యాయవాది తెలిపారు. జనవరి 29న వినయ్శర్మ క్షమాభిక్ష పిటిషన్ వేయగా అతని వినతిని తిరస్కరించాలని జనవరి 30న ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని.. అయితే ఈ సిఫార్సు చేసే సమయంలో.. పిటిషన్పై రాష్ట్ర హోంమంత్రి సంతకం చేశారని గుర్తు చేశారు. సదరు మంత్రి సంతకం చేసిన సమయంలో.. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. అలాంటప్పుడు ఆయనకు సంతకం చేసే అధికారం లేదంటూ వాదిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చెల్లుతుందా?లేదా?అనే అంశాన్ని విచారించాలని కోరినట్లు వినయ్ శర్మ తరఫు లాయర్ ఏపీ సింగ్ తెలిపారు.