AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocker: ఎంత పని చేశావమ్మా..! పతి లేడని తెలిసి… ప్రాణంగా పెంచుకున్న బిడ్డనే

భర్త మరణాన్ని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం వ్యర్థం అని భావించింది. ఈ క్రమంలోనే 6 నెలల బిడ్డడి ప్రాణాలు తీసింది.

Shocker: ఎంత పని చేశావమ్మా..! పతి లేడని తెలిసి... ప్రాణంగా పెంచుకున్న బిడ్డనే
Tragedy
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2022 | 7:26 PM

Share

Tragedy: ఆమె భర్త, బిడ్డే తన సర్వస్వంగా భావించింది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ చిన్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం.. కొండంత విషాదాన్ని నింపింది.  భర్త చనిపోయాడన్న బాధతో తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ గృహిణి. ఈ ఘటన కర్ణాటక(Karnataka) రాయ్​చూర్(Raichur)​​లో శనివారం జరిగింది. గంగాధర్​ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి 6 నెలల క్రితమే బాబు పుట్టాడు. కాగా మంగళూరులోని ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో గంగాధర్ డ్రైవర్​గా జాబ్ చేస్తున్నాడు. రాయ్​చూర్​​లో ఇతను ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌లో గంగాధర్ అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. కుంటికాన సమీపంలో గంగాధర్​ రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి కుందాపుర్ వెళ్తున్న కారు ఢీకొట్టడం వల్ల స్పాట్‌లోనే దుర్మరణం చెందాడు. ఈ విషయం రాయచూర్‌లో ఉన్న అతని భార్యకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె దిగ్భ్రాంతి గురైంది. భర్త మరణ వార్త విని జీర్ణించుకోలేకపోయింది. అతను లేకుండా తన జీవితమే వ్యర్థమని భావించింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్​ను చంపి, తాను సూసైడ్ చేసుకుంది. ఘటనపై మంగళూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు గంగాధర్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు.

Also Read: Telangana: తల్లీ కూతుళ్లతో వ్యక్తి ఎఫైర్.. ఆపై ఊహించని ఇన్సిడెంట్.. విచారణలో విస్తుపోయే నిజాలు