AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోయంబత్తూరులో దారుణం.. దేవాలయాలపై మాంసం ముక్కలు..

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు.. కోయంబత్తూరులోని హిందూ దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక సులివాన్‌ కాలనీలోని వేణుగోపాల స్వామి, రాఘవేంద్ర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో రెండు ఆలయాలు మూతపడ్డాయి. అయితే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తు టూ వీలర్‌పై వచ్చి.. ఆలయ ప్రవేశ ద్వారాల […]

కోయంబత్తూరులో దారుణం.. దేవాలయాలపై మాంసం ముక్కలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2020 | 8:38 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు.. కోయంబత్తూరులోని హిందూ దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక సులివాన్‌ కాలనీలోని వేణుగోపాల స్వామి, రాఘవేంద్ర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో రెండు ఆలయాలు మూతపడ్డాయి. అయితే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తు టూ వీలర్‌పై వచ్చి.. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద మాంసం ముక్కల్ని విసిరి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక భక్తులు, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగుల్ని పట్టుకోని శిక్షించాలంటూ ఆలయం వద్ద ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భక్తులకు సర్ధిచెప్పి.. నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు.