Khammam News: ఖమ్మం నడిరోడ్డిపై మనిషి తల.. మరి కొంచెం దూరం వెళ్లగానే….

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో కలకలం చెలరేగింది. మొండెం లేని మ‌నిషి త‌ల షాక్‌కు గురిచేసింది. ఖమ్మం సిటీ చర్చి కాంపౌండ్ బ్రిడ్జీపై  మొండెం లేకుండా....

Khammam News: ఖమ్మం నడిరోడ్డిపై మనిషి తల.. మరి కొంచెం దూరం వెళ్లగానే....
Man Head Found
Follow us

|

Updated on: Jul 01, 2021 | 4:26 PM

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో కలకలం చెలరేగింది. మొండెం లేని మ‌నిషి త‌ల షాక్‌కు గురిచేసింది. ఖమ్మం సిటీ చర్చి కాంపౌండ్ బ్రిడ్జీపై  మొండెం లేకుండా తల మాత్రమే కనపడటంతో ఎవరైనా దారుణ హత్యకు తెగబడ్డారా  అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రైల్వే ట్రాక్ పై మృతి చెందిన వ్యక్తి తలను కుక్కలు తెచ్చి నట్లు ఉండవచ్చు అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. న‌గ‌రంలోని చ‌ర్చి కాంషౌడ్ బ్రిడ్డి స‌మీపంలో ఉన్న పార్కు వ‌ద్ద గురువారం ఉద‌యం మ‌నిషి తల చూసి ప్రజ‌లు షాక్‌కు గుర‌య్యారు. స్ధానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. చ‌ర్చి కాంపౌండ్ ప‌క్కన రైల్వే ట్రాక్ వ‌ద్ద గుర్తు తెలియ‌ని ఓ వ్యక్తి శవం క‌నిపించిన్నట్లు వివరించారు. ద‌గ్గర‌కు వెళ్లి చూడ‌గా మొండెంకు త‌ల లేద‌ని దీంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన్నట్లు పేర్కొన్నారు.

అయితే ప‌క్కనే ఉన్న బ్రిడ్డి వ‌ద్ద త‌ల క‌నిపించ‌డం ప‌లు అనుమానాలు రేకెత్తిస్తోంది. బుధ‌వారం రాత్రి గుర్తు తెలియ‌ని వ్యక్తి రైల్వే ట్రాక్ పై ఆత్మహ‌త్య చేసుకుని ఉంటార‌ని, అయితే మొండెం నుంచి విడిపోయిన త‌లను కుక్కలు తీసుకువ‌చ్చి ఇక్కడ ప‌డేసి ఉంటాయ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిడ్డి స‌మీనంలో ఎవరైనా వ్యక్తులు చంపేసి ఆత్మహ‌త్మలాగా సీన్ క్రియేట్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మ‌నిషి త‌ల‌ను గోనె సంచిలో వేసి అక్కడ నుండి తీసుకెళ్లారు. ఈ విష‌యం పై వ‌న్‌టౌన్‌, రైల్వే పోలీసుల‌ను అడ‌గ్గా కేసు నమోదు చేసి.. విచార‌ణ చేస్తామని తెలిపారు. కాగా చనిపోయిన వ్యక్తి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

Also Read:  కరోనా సమయంలో అయినవాళ్లు చనిపోతేనే పట్టించుకోవట్లేదు.. కానీ ఈ దంపతులు మాత్రం

ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు