AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్యూమెంట్స్‌ ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి, మద్యం తాగించాడు! మృగంలా మారి.. మాటల్లోని చెప్పలేని విధంగా..

భూమి అమ్మకం పేరుతో ఒక మహిళను మోసం చేసి, హత్య చేసిన ఘటనలో ఒక వ్యక్తి అరెస్టు అయ్యాడు. నిందితుడు రూ.6 లక్షలు తీసుకుని, ఆ తర్వాత మహిళను మద్యం తాగించి, గొంతు కోసి, శవాన్ని దహించాడు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

డాక్యూమెంట్స్‌ ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి, మద్యం తాగించాడు! మృగంలా మారి.. మాటల్లోని చెప్పలేని విధంగా..
Up Murder Case
SN Pasha
|

Updated on: Apr 13, 2025 | 1:17 PM

Share

తన భూమిని అమ్ముతానంటూ ఓ మహిళ వద్ద నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడో వ్యక్తి. ఇక భూమికి సంబంధించిన డాక్యూమెంట్స్‌ ఇస్తానని ఆమెను ఇంటికి రమ్మన్నాడు. ఆమెను మాటల్లో పెట్టి, మెల్లిగా మద్యం తాగించాడు. ఇక ఆ తర్వాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక వ్యక్తి ఒక మహిళకు మద్యం తాగించి, గొంతు కోసి చంపి , ఆపై నిప్పంటించిన సంఘటన జరిగింది.

నిందితులు శివేంద్ర యాదవ్ (26), అతని స్నేహితుడు గౌరవ్ (19) మొదట బాధితురాలికి ఆస్తి పత్రాలు అందించడానికి ఫోన్ చేశారు. ఆమె వచ్చిన తర్వాత, వారు ఆమెకు మద్యం తాగించారు. మత్తులో ఆమె గొంతుకోసి.. ఆ తర్వాత మృతదేహానికి నిప్పు అంటించారు. సగం కాలిన ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారని పోలీసులు తెలిపారు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన అంజలి మృతదేహం శనివారం నది సమీపంలో ముక్కలైపోయిన స్థితిలో లభ్యమైంది.

నిందితుడు తన తండ్రికి, భార్యకు వీడియో కాల్ చేసి బాధితురాలి మృతదేహాన్ని చూపించాడని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె కాలిపోయిన స్కూటర్‌ను కాలువ దగ్గర కనుగొని, ఆమె వ్యాపార భాగస్వామిపై హత్య అభియోగం మోపడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూమి అమ్ముతానని నిందితుడు అంజలి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడని ఆమె సోదరి కిరణ్ చెబుతోంది. తరువాత, పత్రాలు ఇచ్చే నెపంతో, అతను ఆమెకు ఫోన్ చేసి, ఇంటికి పిలిపించి ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో యాదవ్, అతని భార్య నేరం అంగీకరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు