AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veeranki : భార్య-భర్త గొడవ : వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన ఆ భర్త ఏం చేశాడంటే.. !

కృష్ణా జిల్లాలో ఓ భర్త అర్థాంతరంగా తనువు చాలించాడు. తరుచు భార్యతో జరుగుతున్న గొడవలతో మనస్థాపం చెంది ఇక చేసేదేమీ లేదనుకుని..

Veeranki : భార్య-భర్త గొడవ : వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన ఆ భర్త ఏం చేశాడంటే.. !
Lovers Suicide
Venkata Narayana
|

Updated on: Jun 19, 2021 | 6:49 PM

Share

Wife and Husband dispute : కృష్ణా జిల్లాలో ఓ భర్త అర్థాంతరంగా తనువు చాలించాడు. తరుచు భార్యతో జరుగుతున్న గొడవలతో మనస్థాపం చెంది ఇక చేసేదేమీ లేదనుకుని ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పమిడి ముక్కల మండలం, వీరంకి గ్రామానికి చెందిన మరీదు అవినాష్.. వీరంకి గ్రామానికి చెందిన కాసాని దేవీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు కోరుతూ దేవి కోర్టుకెళ్లింది.

ఈ క్రమంలో నిన్న అవినాష్ ఇంటికి వెళ్లిన దేవి.. భర్త కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దేవి వైఖరిపై పమిడిముక్కల పోలీస్ స్టేషన్ లో భర్త అవినాష్ ఫిర్యాదు చేశాడు. దీంతో వివాదంపై పోలీసులు ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతుండగా అవినాష్ కుటుంబ సభ్యులపై స్టేషన్లోనే దేవి చేయి చేసుకున్నట్టు చెబుతున్నారు.

దేవి వైఖరితో మనస్తాపం చెందిన అవినాష్.. వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్లి, వీరంకి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దేవి పెట్టిన వేధింపులు, పోలీసుల అలసత్వం వల్లనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అవినాష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also : Tirumala : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక మరో రెండు భాషల్లో.. కొత్తగా 16 టీటీడీ కళ్యాణ మండపాలు : టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి