AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బందరులో బ్యాంక్ మోసం..గిల్టు నగలతో నగదు స్వాహా…

అక్కడ ఓ బ్యాంక్ ఆఫీసర్లు ఏకంగా గిల్టు నగలపైనే లక్షల నగదు అప్పుగా ఇచ్చారు..తీరా అవి నకిలీ బంగారం అని తేలటంతో ప్రక్షాళన పనిలో పడ్డారు అధికారులు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు...

బందరులో బ్యాంక్ మోసం..గిల్టు నగలతో నగదు స్వాహా...
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2020 | 2:00 PM

Share

సామాన్యులేవరైనా..అత్యవసర పరిస్థితి ఎదురై బంగారు నగలు తనాఖా పెట్టేందుకు బ్యాంకుకు వెళితే, ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తారు బ్యాంక్ అధికారులు. కానీ, అక్కడ ఓ బ్యాంక్ ఆఫీసర్లు మాత్రం ఏకంగా గిల్టు నగలపైనే లక్షల నగదు అప్పుగా ఇచ్చారు..తీరా అవి నకిలీ బంగారం అని తేలటంతో ప్రక్షాళన పనిలో పడ్డారు అధికారులు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జరిగిన మోసంలో బ్యాంక్ సిబ్బంది హస్తం కూడా ఉండటంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు…పూర్తి వివరాల్లోకి వెళితే…

కృష్ణా జిల్లా మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో బ్యాంకు అప్రైజర్ ఖాతాదారులను బురిడీ కొట్టించాడు. బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి గోల్డ్ లోన్లను స్వాహా చేశారు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేరుతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్ లక్షల్లో బ్యాంక్‌‌కు టోపీపెట్టాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.