AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే వధువు దారుణ హత్య

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొద్ది గంట‌ల్లో పెళ్లి కావల్సిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. పెండ్లి మేక‌ప్ కోసం బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లిన యువ‌తిని ఓ కిరాతకుడు క‌త్తితో మెడ‌కోసి హ‌త్య‌ చేశాడు. రక్తమడుగులో పడి ఉన్న యువతిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే వధువు దారుణ హత్య
Balaraju Goud
|

Updated on: Jul 05, 2020 | 5:47 PM

Share

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొద్ది గంట‌ల్లో పెళ్లి కావల్సిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. పెండ్లి మేక‌ప్ కోసం బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లిన యువ‌తిని ఓ కిరాతకుడు క‌త్తితో మెడ‌కోసి హ‌త్య‌ చేశాడు. రక్తమడుగులో పడి ఉన్న యువతిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ర‌త్లామ్ జిల్లా జ‌వోరా గ్రామానికి చెందిన యువతికి ఆదివారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. దీంతో మధ్యాహ్న సమయంలో తన చెల్లెలును వెంట తీసుకుని మేకప్ కోసం సమీపంలోని బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లింది. ఇంతలో నిందితుడు క‌త్తితో బ్యూటీ పార్ల‌ర్‌లో చొర‌బ‌డ్డాడు. ఏం జరిగిందో తేరుకునే లోపే కత్తితో యువతి గొంతుకోసి పారిపోయినట్లు యువతి చెల్లెల్లు తెలిపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం పత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. ఘ‌ట‌నా ప్రాంతం నుంచి సేక‌రించిన కొన్ని క్లూస్ ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు రత్లామ్ ఎస్పీ గౌరవ్ తివారి తెలిపారు.