వికారాబాద్ జిల్లాలో విషాదం.. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి

వికారాబాద్ జిల్లా విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు.

వికారాబాద్ జిల్లాలో విషాదం.. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి
Follow us

|

Updated on: Feb 21, 2021 | 3:21 PM

వికారాబాద్ జిల్లా విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. నారాయణపేట జిల్లా వోట్కూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ హైమద్‌(38) వికారాబాద్‌ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో గత నవంబర్‌ నుంచి ఉర్దూ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి ఓ ఉపాధ్యాయుడు డ్యూటీ చేస్తారు. హైమద్‌ శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు తర్వాత బాత్రూంకు వెళ్లారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ గార్డు సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఉపాధ్యాయుడు కుప్పకూలి పడిపోయాడు. దీంతో వెంటనే విషయాన్ని ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. 108 సహాయంతో ఖలీల్‌ను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిశీలించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిః  పొలిటికల్ హీట్ పెంచుతోన్న గట్టు వామన్‌రావు దంపతుల హత్య, ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న వివాదాలు