AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకుల్లో మాయమవుతున్న బంగారం .. భయపెడుతున్న చోరీలు

వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి. బయట సెక్యూరీగార్డులు రెప్పవాల్చకుండా కాపలా కాస్తున్నా బ్యాంకును లూటీ చేసేశారు. చిత్తూరు జిల్లా యదమరి మండల పరిధిలోగల మోర్ధానపల్లి వద్దగల అమరరాజా కంపెనీ ఆవరణలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదును మాయం చేశారు. ఎన్నో కట్టుదిట్టమై చర్యలు చేపట్టే బ్యాంకుల్లోనే ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో […]

బ్యాంకుల్లో మాయమవుతున్న బంగారం .. భయపెడుతున్న చోరీలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 16, 2019 | 10:12 PM

Share

వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి. బయట సెక్యూరీగార్డులు రెప్పవాల్చకుండా కాపలా కాస్తున్నా బ్యాంకును లూటీ చేసేశారు. చిత్తూరు జిల్లా యదమరి మండల పరిధిలోగల మోర్ధానపల్లి వద్దగల అమరరాజా కంపెనీ ఆవరణలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదును మాయం చేశారు.

ఎన్నో కట్టుదిట్టమై చర్యలు చేపట్టే బ్యాంకుల్లోనే ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో బ్యాంకులపట్ల నమ్మకం లేకుండా పోతుంది. తాజాగా జరిగిన ఈ భారీ చోరీలో దొంగలు సీసీ కెమెరాలకు సంబంధించిన కంప్యూటర్ సర్వర్ మాయం కావడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది?

శనివారం బ్యాంకుకు సెలవు. అయినా బ్యాంక్ మేనేజర్ మాత్రం బ్యాంకుకు వచ్చారు. ఇక ఆదివారం కూడా పూర్తి సెలవు కావడంతో దొంగతనం జరినట్టు ఎవరీకీ తెలియలేదు. సోమవారం యధావిధిగా బ్యాంకు తాళాలు తెరిచి చూసే సరికి చోరీ జరిగినట్టు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డీ క్లూస్‌ టీమ్‌తో పాటు స్నిప్పర్ డాగ్స్‌తో సహా అక్కడికి చేరుకుని పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, వద్ద ఉన్న తాళాలతో లాకర్లు ఓపెన్ చేసి చూశారు. అయితే లాకర్లలో ఉన్న కొద్దిపాటి నగదును వాసన చూసిన డాగ్స్.. దొంగలు వెళ్లిన మార్గంలో పరుగులు తీసి.. దగ్గర్లోని హైవే వరకు వెళ్లి ఆగిపోయాయి.

ఇంటిదొంగల పనేనా?

రూ. 3 కోట్లకు పైగా విలువ గల 17 కిలోల బంగారం చోరీ కావడం ఎన్నోఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసిన తాళాలు వేసినట్టే ఉండటం, లాకర్లలో బంగారు మాయం చేయడాన్ని బట్టి అత్యంత చాకచక్యంగా.. తెలివిగా ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సీసీ కెమెరాలకు సంబంధించిన కంప్యూటర్ సర్వర్ మాయం కావడం కూడా చోరీలో అనుమానాలను రెట్టింపు చేస్తోంది. ఇది ప్రొఫెషనల్స్ చేశారా? లేక ఇంటిదొంగల పనేనా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో బ్యాంకు మేనేజర్‌ పురుషోత్తంతో పాటు క్యాషియర్‌ నారాయణను కూడా అదుపులోకి తీసుకుని నిజాలు రాబడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని చోరీ చేయడం వెనుకు దాగిఉన్న అసలు దొంగల పనిపట్టే పనిలో ఉన్నారు చిత్తూరు పోలీసులు.

Follow Us
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?