AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నపాటుగా ఫేమస్ అయిపోవాలకుంటే ఇంతేమరి..!

రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని కొంతమంది తీసుకునే డెసిషన్స్ .. వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే  ఇటీవల చోటుచేసుకుంది. ముంబైకి చెందిన అభిషేక్ తివారీ అనే వ్యక్తి తన విద్యను మధ్యలోనే ఆపేసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఉన్నపాటుగా నలుగురిలో ఫేమస్ అయిపోవాలని.. అంతా తనను గుర్తించాలని కలలుకన్నాడు. అంతే వెంటనే ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ పంపాడు. అయితే ఇదేదో ఆకతాయి చేసిన పని అని […]

ఉన్నపాటుగా ఫేమస్ అయిపోవాలకుంటే  ఇంతేమరి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 09, 2019 | 8:04 PM

Share

రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని కొంతమంది తీసుకునే డెసిషన్స్ .. వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే  ఇటీవల చోటుచేసుకుంది. ముంబైకి చెందిన అభిషేక్ తివారీ అనే వ్యక్తి తన విద్యను మధ్యలోనే ఆపేసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఉన్నపాటుగా నలుగురిలో ఫేమస్ అయిపోవాలని.. అంతా తనను గుర్తించాలని కలలుకన్నాడు. అంతే వెంటనే ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ పంపాడు. అయితే ఇదేదో ఆకతాయి చేసిన పని అని వారు లైట్ తీసుకున్నారు. దీంతో మనోడు మరింత రెచ్చిపోయాడు. ఈసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా మరికొందర్ని చంపుతానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు. ఇక్కడే దొరికిపోయాడు అభిషేక్ తివారీ.

ఈ మెయిల్స్‌పై విచారణ జరపాల్సిందిగా సీఎం కార్యాలయ సిబ్బంది .. ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు కథ బయటపడింది. ఇలాంటి మెయిల్స్ పంపుతున్న వ్యక్తి ముంబైకి చెందిన అభిషేక్ తివారీ అని గుర్తించారు. వెంటనే ఓ బృందం అక్కడికి వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. చూశారా.. ఉన్నపాటుగా ఫేమస్ అయిపోవాలనే కోరిక అతడ్ని ఎంతగా ఫేమస్ చేసిందో. ఇప్పుడు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది.