దారుణం.. పెళ్లికి గుర్రంపై ఊరేగుతావా అంటూ.. దళితుడిపై..
ప్రభుత్వాలు ఏం ఉన్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దళితులపై దేశంలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వాలు ఏం ఉన్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దళితులపై దేశంలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ.. వారిపై దాడులు కానీ.. అవమానాలు కానీ తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది.రాష్ట్రంలోని ఛతర్పూర్లోని సతై ప్రాంతంలో దళిత వర్గానికి చెందిన ఓ యువకుడు వివాహ వేడుకల్లో గుర్రంపై ఊరేగుతుండగా.. ఘోర అవమానం చేశారు అక్కడి ఓ వర్గానికి చెందిన వారు. గుర్రంపై ఊరేగుతున్న ఆ పెళ్లి కొడుకును కిందకు లాగేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ వర్గానికి చెందిన వారు కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని సతై పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో తెలిపారు. ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్ట్ కూడా చేశామన్నారు.