AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

ఈ గ్యాంగ్ వార్ ఘటనపై బెజవాడ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పండు, సందీప్ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ విధించారు. గ్యాంగ్ వార్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నగరం విడిచి వెళ్లాలని డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ...

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 11:24 AM

Share

విజయవాడలో పండు, సందీప్‌ల గ్యాంగ్ వార్ కల‌కలం రేపిన విషయం తెలిసిందే. ఈ గొడ‌వ‌లో తోట సందీప్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేసింది. విజ‌యవాడ‌లో మ‌ళ్లీ పాత ప‌రిస్థితులు మొద‌ల‌వుతాయ‌న్న ఆందోళ‌న‌ స్థానికులు నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది.

ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ వార్ ఘటనపై బెజవాడ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పండు, సందీప్ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ విధించారు. గ్యాంగ్ వార్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నగరం విడిచి వెళ్లాలని డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటివరకూ ఈ రెండు గ్యాంగ్‌లకు సంబంధించిన 37 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా మరో రెండు గ్యాంగ్‌లకు చెందిని 13 మంది నిందితులు పరారీలో ఉన్నారు.

కాగా ఈ గ్యాంగ్ వార్ కేసులో ప్ర‌ధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠ అరెస్ట‌య్యాడు. గొడ‌వ‌లో గాయాలు అవ్వ‌డంతో గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పోలీస్ ప్రొటక్ష‌న్ మ‌ధ్య అత‌డికి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి కుద‌టప‌డ‌టంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వ‌ద్ద నుంచి తోట సందీప్ హ‌త్య‌కు వినియోగించిన రెండు క‌త్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌మూర్తి ఆదేశాల‌తో పండును రాజమండ్రి సెంట్రల్ జైలు‌కి త‌ర‌లించారు పోలీసులు.

Read More: 

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…