Police attack : పోలీసుల దాష్టీకం, వృత్తిధర్మం, మానవత్వం మరిచి కరోనా పేషంట్‌, కుటుంబ సభ్యులపై వికృత చేష్టలు

Madhya Pradesh Police brutally attacked : మధ్యప్రదేశ్‌ పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది.

Police attack : పోలీసుల దాష్టీకం, వృత్తిధర్మం, మానవత్వం మరిచి కరోనా పేషంట్‌, కుటుంబ సభ్యులపై వికృత చేష్టలు
Mp Police
Follow us

|

Updated on: Apr 11, 2021 | 8:21 PM

Madhya Pradesh Police brutally attacked : మధ్యప్రదేశ్‌ పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. మానవత్వం మరిచిన పోలీసులు కరోనా పేషంట్‌ను చితకబాదారు . లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న కుటుంబసభ్యులను కూడా గొడ్డును బాదినట్టు బాదారు. అమానుషమైన ఈ ఘటన ఖాండ్వాలో జరిగింది. పోలీసులు దాడిలో కరోనా పేషంట్‌తో సహా కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి.

కొద్దిరోజుల క్రితం బంజరి గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆరోగ్యశాఖ సిబ్బంది ఆ యువకుడికి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చారు. అయితే తాను ఆశా కార్యకర్త అని , తన కుమారుడు ఇంట్లోనే కరోనా చికిత్స తీసుకుంటాడని ఆ యువకుడి తల్లి ఆరోగ్యశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. హెల్త్‌ వర్కర్లపై కరోనా పేషంట్‌ కుటుంబసభ్యులు దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో బంజరి గ్రామానికి చేరుకున్న పోలీసులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. కరోనా పేషంట్‌తో సహా కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇద్దరు పోలీసులను బదిలీ చేశారు ఉన్నతాధికారులు.

Read also : Megha Gas : తెలంగాణలో ఇక చౌకగా ఇంటి.. వాహన గ్యాస్‌.! పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ‘మేఘా’ సంస్థ