AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి..

Car Crashed:తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొలాకుల వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న..

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి..
Sanjay Kasula
|

Updated on: Mar 12, 2021 | 10:24 AM

Share

Car Crashed into a Crop Canal: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొలాకుల వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు.

పాలకోడేరు మండలం గొల్లల కోడేరుకు చెందిన ముందిటి సురేష్‌ వర్మ, చింతలపాటి శ్రీనివాస్‌రాజు, ఇందుకూరి వెంకటసత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజులు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. మహా శివరాత్రి సందర్భంగా బంధువులు ఇంటికి శివరాత్రి వేడుకలకు వచ్చారు. వీరంతా ఈ తెల్లవారుజామున తిరిగి కారులో వెళ్తుండగా లొల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

వీరిలో వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. సురేష్‌ వర్మ, శ్రీనివాస్‌రాజు, సత్యనారాయణరాజుల మృతదేహాలు బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

 Katas Raj Temple in Pakistan: పాకిస్తాన్‌లో పరమశివుడి ఆలయం.. దాయాది దేశంలో విరాజిల్లుతున్న భోళాశంకరుడు

ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు, హాజరైన ప్రధాని నరేంద్రమోదీ