విషాదం..బాలుడి ప్రాణం తీసిన పతంగి
వికారాబాద్లో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తుండగా..ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఒక బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పరిగి మండలం బాహర్పేట్కు చెందిన జాహెద్ అలీ తొమ్మిదేళ్ల తనయుడు జహీర్ , రఫీ కుమారుడు సమీర్ ఇంటి డాబాపై గాలిపటాలు ఎగవేస్తున్నారు. ఈ క్రమంలో పతంగి హైటెన్షన్ వైర్ల మధ్యలో చిక్కుకుంది. దానిని తప్పించే క్రమంలో పిల్లలిద్దరూ కరెంట్ షాక్కు గురయ్యారు. స్పాట్లోనే జహీర్ మృతి చెందగా… […]
వికారాబాద్లో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తుండగా..ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఒక బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పరిగి మండలం బాహర్పేట్కు చెందిన జాహెద్ అలీ తొమ్మిదేళ్ల తనయుడు జహీర్ , రఫీ కుమారుడు సమీర్ ఇంటి డాబాపై గాలిపటాలు ఎగవేస్తున్నారు. ఈ క్రమంలో పతంగి హైటెన్షన్ వైర్ల మధ్యలో చిక్కుకుంది. దానిని తప్పించే క్రమంలో పిల్లలిద్దరూ కరెంట్ షాక్కు గురయ్యారు. స్పాట్లోనే జహీర్ మృతి చెందగా… సమీర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు కంగారుపడ్డారు.
కాగా పతంగిని ఇనుప రాడ్తో తీసేందకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇనుముకు పవర్ చాలా ఈజీగా పాస్ అవుతుంది. అందులోనూ అవి హై టెన్షన్ వైర్లు..అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అనుకోని ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలుడి తల్లీదండ్రులను కంట్రోల్ చెయ్యడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.