AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నీళ్ళ సీసా కొనలేదని..అసభ్యంగా మాట్లాడిన వ్యాపారి..చెంప పగులగొట్టిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే..

తనతో అసభ్యకరంగా మాట్లాడిన ఓ వ్యాపారి చెంప పగులగొట్టింది ఓ మహిళ. ఈ సంఘటన హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad: నీళ్ళ సీసా కొనలేదని..అసభ్యంగా మాట్లాడిన వ్యాపారి..చెంప పగులగొట్టిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే..
Woman Slammed A Man
KVD Varma
|

Updated on: Apr 22, 2021 | 1:11 PM

Share

Hyderabad:  తనతో అసభ్యకరంగా మాట్లాడిన ఓ వ్యాపారి చెంప పగులగొట్టింది ఓ మహిళ. ఈ సంఘటన హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన ఒక మహిళ వ్యాపారి నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కుంది. వస్తువులు కొనుగోలు చేయలేదని ఆ వ్యాపారి ఆమెను అసభ్యంగా దూశించాడు. దీంతో ఆమె అతని చెంపదెబ్బ కొట్టింది. వెంటనే, సదరు వ్యాపారి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన లక్ష్మి హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. రేతిఫైల్ బస్టాప్ వద్ద ఆటో ఎక్కేందుకు నడుచుకుంటూ తన స్నేహితురాలితో వెళుతోంది. ఆ దారిలో రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఖాజా అనే వ్యక్తి వాటర్ బాటిళ్ళు అమ్ముతున్నాడు. లక్ష్మి వాటర్ బాటిల్ ధర ఎంత అని ఖాజాను అడిగింది. ధర ఎక్కువ చెప్పాడు అతను. దీంతో వద్దు అని చెప్పి లక్ష్మి వెల్లిపోతుండగా ఆమెను బూతులు తిట్టాడు ఖాజా. ఆగ్రహానికి గురైన లక్ష్మి ఖాజా చెంప చెళ్ళుమనిపించింది. ఆ ఫుట్ పాత్ వ్యాపారి ఒక్కసారిగా ఆమెపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఖాజా అనబడే వ్యాపారి గతంలోనూ చాలా మంది వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించినట్లు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని తెలిసింది.

ఇదిలా ఉండగా గోపాలపురం పోలీసులు లక్ష్మి ఫిర్యాదు మేరకు ఖాజాను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఆ సమయంలో ఆ మహిళ బంధువు ఒకరు అక్కడకు చేరుకొని ఖాజాపై దాడికి దిగారు. దీంతో పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు.

Also Read: ఘోరం ! హర్యానాలోని ఆసుపత్రిలో 1710 కోవిడ్ వ్యాక్సిన్ల చోరీ, జింద్ జిల్లాలో నో వ్యాక్సిన్

Uttar Pradesh:ఘోర ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు.. ఐదుగురు మృతి..