Telugu News Crime 8 killed in Road Accident in Siddharthnagar UP, PM Modi, CM Yogi expresses grief
Road Accident: వివాహ వేడుకకు హాజరై వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం..
జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
UP Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం యూపీలోని సిద్ధార్థ్నగర్ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం.. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గోరఖ్పూర్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. వివాహా ఊరేగింపు కార్యక్రమానికి హాజరై నుంచి తిరిగి వస్తుండగా బలేరో ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో కారులో 11 మంది ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు.
UP | Eight people killed after a jeep carrying 11 people rammed into a stationary truck on NH28 in Siddharthnagar dist
CM expresses deep condolences on the loss of lives in the road accident. He has given instructions to provide proper treatment to those injured in the accident pic.twitter.com/8UH7hiOi67
కాగా.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
उत्तर प्रदेश के सिद्धार्थनगर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.