Accident: నిద్రలోనే మృత్యు ఒడిలోకి.. గుడిసెలోకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం..

Truck rams into Hut: వారంతా భోజనాలు చేసి.. నిద్రలోకి జారకున్నారు. మరికొంతసమయమైతే తెల్లారుతుంది. ఈ లోగానే మృత్యువు వారందరినీ

Accident: నిద్రలోనే మృత్యు ఒడిలోకి.. గుడిసెలోకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం..
Road Accident
Follow us

|

Updated on: Aug 09, 2021 | 9:53 AM

Truck rams into Hut: వారంతా భోజనాలు చేసి.. నిద్రలోకి జారకున్నారు. మరికొంతసమయమైతే తెల్లారుతుంది. ఈ లోగానే మృత్యువు వారందరినీ కబళించింది. రోడ్డుపక్కనున్న గుడిసెలోకి.. ట్రక్కు దూసుకెళ్లి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సావర్‌కుండ్ల ప్రాంంతోని బధాడా గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు వృద్ధులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో లారీ.. మహువా వైపు క్రేన్ తొ వెళ్తోంది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సమచారం అందగానే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అమ్రేలి పోలీసు సూపరింటెండెంట్ నిర్లిప్త్ రాయ్ తెలిపారు. లారీ పదిమందిపై నుంచి దూసుకెళ్లిందని.. పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Also Read:

KFC Chicken: అక్కడ చికెన్‌ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? మీకు ఇలాంటి ఉడికిఉడకని పీస్‌లు కూడా రావొచ్చు..

Viral Video: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు