Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 27 మంది దుర్మరణం.. 

Bus Accident in Peru: పెరూలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డి 27 మంది దుర్మరణం చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పాలొమినో

Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 27 మంది దుర్మరణం.. 
Accident
Follow us

|

Updated on: Jun 19, 2021 | 8:54 AM

Bus Accident in Peru: పెరూలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభవించింది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డి 27 మంది దుర్మరణం చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సు.. పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం తెల్ల‌వారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట‌రియోసియానిక్ జాతీయ ర‌హ‌దారిపై ఒక్క‌సారిగా లోయ‌లో ప‌డిపోయినట్లు పెరూ అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారని.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పెరూ దేశ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
అయితే..  పాలొమినో కంపెనీకి చెందన బస్సులో పలు కుటుంబాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read:

Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!

Antonio Guterres: ఐక్యరాజ్య సమితి చీఫ్‌గా ఆంటోనియా గుటెరస్‌.. వరుసగా రెండోసారి ఎన్నిక