బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..

ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటికి దగ్గరలోనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఈ వైరస్ ప్రజా ప్రతినిధులపై, పోలీసులపై, ప్రభుత్వ ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం..

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 5:07 PM

ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటికి దగ్గరలోనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఈ వైరస్ ప్రజా ప్రతినిధులపై, పోలీసులపై, ప్రభుత్వ ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. దీంతో ఇప్పటికే చాలామంది ప్రమఖులు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఏపీలోని ఓ వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. కాగా ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటుంది. ముందు జాగ్రత్తగా కొన్ని జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధించింది ఏపీ సర్కార్.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మనవడు అన్న గౌతమ(7)కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. బాలుడు మాత్రమే కాకుండా ఎమ్మెల్యే కారు డ్రైవర్, అటెండర్‌కి కూడా కోవిడ్ నిర్థారణ అయిందని వైద్య అధికారులు వెల్లడించారు.

Read More: 

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!