కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటికి దగ్గరలోకి కోవిడ్ కేసులు చేరుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ప్రపంచం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా...
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటికి దగ్గరలోకి కోవిడ్ కేసులు చేరుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రపంచం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇటీవల నా ఫ్రెండ్ శిల్పారెడ్డి, ఆమె భర్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ సమయంలో వాళ్లేం చేశారో శిల్పారెడ్డి వివరంగా చెప్పారు. విన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా’.
శిల్పారెడ్డి ఇన్స్టా వీడియో కీ పాయింట్స్:
* ఆ మధ్య మా ఇంటికి వచ్చిన ఓ ఫ్రెండ్ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. * అందుకే నేను, మా వారూ టెస్ట్ చేయించుకున్నాం. * మాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. అయినా పాజిటివ్ అని తేలింది. * ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా ఉండాలి * ప్రతి నిత్యం యోగా, క్రియ, ధ్యానం చేయాలి. * కోవిడ్ ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని ఆమె చేసిన ఇన్స్టా వీడియోను ఫ్యాన్స్తో పంచుకున్నారు అక్కినేని నాగార్జున.
As the cases of #COVID__19 increase in the world,The only weapon right now seems to be being healthy in mind & body.Our dear friend #Shilpareddy and her husband experienced the virus and came out of it shining!!?? Listen to her experience..inspiring!!? https://t.co/mqRmuLQYlM
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 25, 2020