AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్‌.. ఉధృతంగా కేసులు న‌మోదు..

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే..

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్‌.. ఉధృతంగా కేసులు న‌మోదు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2020 | 7:49 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. కాగా గురువారం కొత్త‌గా ప్రపంచ వ్యాప్తంగా 2,77,983 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 1,56,51,599కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ 6,36,494 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 54,79,927 యాక్టీవ్ కేసులు ఉండగా, 95,35,208 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 69,116 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 41,69,991కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,47,333 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 45,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 7,82,607 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,129 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 29,861 మంది మరణించారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. విప‌రీతంగా పెరిగిపోతున్న కేసులు..

Follow Us
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ