AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నిద్ర పోతుందట.. పాక్‌ మతాధికారి వింత వ్యాఖ్యలు.. అంతేకాదు.. ఇంకా ఏం చెప్పాడంటే..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ మతాధికారి కరోనా గురించి వింత వ్యాఖ్యలు చేశాడు. కరోనా సోకకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పాడు.

కరోనా నిద్ర పోతుందట.. పాక్‌ మతాధికారి వింత వ్యాఖ్యలు.. అంతేకాదు.. ఇంకా ఏం చెప్పాడంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 4:05 PM

Share

కరోనా మహమ్మారి రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలుత చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఆ తర్వాత బ్రిటన్‌, యూరప్ దేశాల్లో విజృంభించింది. ఆ తర్వాత.. అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తోంది. ఇక మొన్నమొన్నటి వరకు మన భారత్‌తో పాటు పొరుగు దేశాల్లో అత్యల్పంగా నమోదైన కేసులు.. ఇప్పుడు లక్షల్లోకి వెళ్లాయి. తాజాగా మన పొరుగుదేశం పాక్‌లో లక్ష మార్క్‌ను దాటేసింది. అయితే అక్కడ గత నెలలోనే లాక్‌డౌన్ కూడా ఎత్తేయడంతో.. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అక్కడ కొందరు మంత్రులు, మత పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే విన్నవారు నవ్వాపుకోలేకపోతున్నారు.

తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మతాధికారి కరోనా గురించి వింత వ్యాఖ్యలు చేశాడు. కరోనా సోకకుండా ఉండాలంటే.. ప్రజలంతా ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పాడు. అందుకు ఓ విశ్లేషణ కూడా చెప్పడం.. అది విన్న వారంతా ఏం అనాలో అర్ధం కాని పరిస్థితి తలెత్తింది. మనం నిద్రపోయే సమయంలో కరోనా కూడా నిద్రపోతుందని.. మనం మరణిస్తే అది కూడా మరణిస్తుందంటూ వింత వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో పాకిస్థాన్‌లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఎక్కువ సేపు నిద్ర పోవాలని వైద్యులు చెప్పారని ట్విస్ట్ కూడా ఇచ్చాడు. మనం ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే.. వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా నిద్రపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు పాక్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిని అక్కడి ఓ జర్నలిస్ట్ సోసల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం