కరోనా అదుపులో కేరళ రూటే సెపరేట్..
దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అదుపులో కేరళ దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. ఈ నెల 13 నాటికి ఇన్ఫెక్షన్ కేసులు 9 వేలు దాటినప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నప్పటికీ ఈ రాష్ట్రం మాత్రం చాలావరకు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. గత మూడు రోజుల్లో కేవలం రెండు నుంచి మూడు కేసులు మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. 13 నాటికి 376 కేసులు నమోదు కాగా.. వాటిలో 179 మంది రోగులు కోలుకున్నారు. లాక్ […]
దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అదుపులో కేరళ దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. ఈ నెల 13 నాటికి ఇన్ఫెక్షన్ కేసులు 9 వేలు దాటినప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నప్పటికీ ఈ రాష్ట్రం మాత్రం చాలావరకు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. గత మూడు రోజుల్లో కేవలం రెండు నుంచి మూడు కేసులు మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. 13 నాటికి 376 కేసులు నమోదు కాగా.. వాటిలో 179 మంది రోగులు కోలుకున్నారు. లాక్ డౌన్ ని ప్రజలు ఖఛ్చితంగా పాటించేలా చూడడం, ప్రతి రోగి తాలూకు పూర్వాపరాలు, వారి ట్రావెల్ హిస్టరీ, వారి ప్రైవసీకి భంగం కలగకుండా సోషల్ మీడియాలో వారి వివరాలు నమోదు చేసి, ఇతరులను అలర్ట్ చేయడం వంటి చర్యల కారణంగా కేరళ కరోనాకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్న అలసత్వ ధోరణి కూడా ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది.