AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ 2.0.. మే 3 వరకు విమానాలు కూడా బంద్…

దేశవ్యాప్త లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, విదేశీయ విమానాల సర్వీసులను మే 3 వరకు రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇక ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్‌కు అనుమతి ఇవ్వగా.. బుక్ చేసుకున్న ప్రయాణీకులకు డబ్బులు రీఫండ్ ఇవ్వనున్నారు. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల ౩వ తేదీ వరకు […]

లాక్ డౌన్ 2.0.. మే 3 వరకు విమానాలు కూడా బంద్...
Ravi Kiran
|

Updated on: Apr 14, 2020 | 3:24 PM

Share

దేశవ్యాప్త లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, విదేశీయ విమానాల సర్వీసులను మే 3 వరకు రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇక ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్‌కు అనుమతి ఇవ్వగా.. బుక్ చేసుకున్న ప్రయాణీకులకు డబ్బులు రీఫండ్ ఇవ్వనున్నారు.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల ౩వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20 వరకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం తప్పితే మినహా.. ఇళ్ల నుంచి బయటికి రాకూడదని తెలిపారు.

ఇవి చదవండి:

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

ఏపీ: రెడ్‌జోన్‌లో 41.. ఆరెంజ్‌ జోన్‌లో 45.. గ్రీన్ జోన్‌లో 590… షరతులు వర్తిస్తాయి.

మందుబాబులకు ‘లిక్కర్ దానం’.. వీడియో వైరల్.. హైదరాబాద్ యువకుడి అరెస్ట్..