AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. కరోనా బారినపడి ఇద్దరు పోలీసులు మృతి..

మహారాష్ట్రలో కరోనా వైరస్ పోలీసులను వణికిస్తోంది. ఇప్పటికే 2500 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు పదుల సంఖ్యలో మరణించారు. తాజాగా శనివారం నాడు కరోనా కాటుకు ఇద్దరు పోలీసులు మరణించారు.

బ్రేకింగ్.. కరోనా బారినపడి ఇద్దరు పోలీసులు మృతి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 5:24 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. కరోనా బారినపడి ఆరువేల మందికిపైగా మరణించారు. ఇక దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే 80వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో కరోనా వైరస్ పోలీసులను వణికిస్తోంది. ఇప్పటికే 2500 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు పదుల సంఖ్యలో మరణించారు. తాజాగా శనివారం నాడు కరోనా కాటుకు ఇద్దరు పోలీసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారినపడి మరణించిన పోలీస్ సిబ్బంది సంఖ్య 33కు చేరింది. శనివారం నాడు పోలీస్ సిబ్బంది ఎవరు కూడా కరోనా బారినపడలేదని.. ఇప్పటి వరకు మొత్తం 2,561 సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు.

ఇక రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన కేసుల వివరాలను అధికారులు వివరించారు. మార్చి 23 నుంచి ఇప్పటి వరకు 1,23,105 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులన్నీ ఐసీపీ సెక్షన్‌ 188 కింద నమోదైనవేనంటూ వివరించారు. అంతేకాదు.. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులపై కూడా దాడులు జరిగాయని.. ఇప్పటి వరకు 260 మంది మీద దాడి జరగగా.. అందులో 86 మంది గాయపడ్డారని మహారాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు.