AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగల షాపులో పని చేస్తున్న సిబ్బందిలో 31 మందికి కరోనా పాజిటివ్‌

కరోనా వైరస్‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. అక్కడా ఇక్కడా అని లేదు.. అంతటా కరోనా ఉంటోంది..

నగల షాపులో పని చేస్తున్న సిబ్బందిలో 31 మందికి కరోనా పాజిటివ్‌
Balu
|

Updated on: Nov 20, 2020 | 11:29 AM

Share

కరోనా వైరస్‌ ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. అక్కడా ఇక్కడా అని లేదు.. అంతటా కరోనా ఉంటోంది.. మధ్యప్రదేశ్‌లో అయితే ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు పెరుగుతున్నాయి.. ఇండోర్ పట్టణంలోని ఓ నగల షాపులో పని చేసే 31 మంది సిబ్బందికి కరోనా సోకింది.. అధికారులు వెంటనే ఆ షాపును మూసేశారు.. అంతేకాదు.. గత వారం రోజులుగా ఈ షాపుకు వచ్చిన వినియోగదారులను గుర్తించే పనిలో పడ్డారు.. మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు.. షాపుకు వచ్చిన వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు వుంటే వెంటనే తమకు తెలియచేయాలని అధికారులు చెప్పారు. నగల షాపును పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. పరిస్థితి కుదుటపడిన తర్వాతే షాపును తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. ధన్‌తేరాస్‌ రోజున షాపు వినియోగదారులతో కిటకిటలాడిందట! ఆ తర్వాత దీపావళి రోజున కూడా అదే పరిస్థితి నెలకొన్నదట! ఈ రద్దీ కారణంగానే కరోనా అంతమందికి అంటుకుని ఉంటుందని అధికారులు అంటున్నారు. పండుగ రోజున నగలు కొనాలని ఉంటుంది కానీ ఇలా కోవిడ్‌ -19 నిబంధనలు పక్కన పెట్టేసి జనం రావడమే అనర్థానికి కారణమని చెబుతున్నారు. ఎవరూ మాస్క్‌లు పెట్టుకోవడం లేదట! భౌతిక దూరాన్ని పాటించడం లేదట! ఇలా అయితే ఒకే దుకాణంలో ఇంత మంది సిబ్బందికి కొవిడ్‌ సోకడం ఆశ్చర్యమేమి లేదు!