AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: కరోనాతో 10 రోజుల బాలిక మృతి

హైదరాబాద్‌లోని రంగారెడ్డి నగర్ దావూద్ బస్తీలో కరోనా వైరస్‌తో 10 రోజుల బాలిక మృతి చెందింది. నీలోఫోర్ ఆస్పత్రిలో సోమవారం మృతి చెందగా అనుమానంతో పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షల్లో బాలికకు కోవిడ్ ఉందని..

బ్రేకింగ్: కరోనాతో 10 రోజుల బాలిక మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2020 | 8:25 PM

Share

హైదరాబాద్‌లోని రంగారెడ్డి నగర్ దావూద్ బస్తీలో కరోనా వైరస్‌తో 10 రోజుల బాలిక మృతి చెందింది. నీలోఫోర్ ఆస్పత్రిలో సోమవారం మృతి చెందగా అనుమానంతో పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షల్లో బాలికకు కోవిడ్ ఉందని తేలింది. అయితే.. తల్లిదండ్రులకు కూడా కరోనా ఉందేమోనని టెస్టులు చేయగా వారికి పాజిటివ్ వచ్చింది. కాగా వారిని హోమ్ క్వారంటైన్‌కి తరలించారు అధికారులు. దీంతో బాలికకు నీలోఫర్‌లోనే కరోనా వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 71 పాజిటివ్ కేసులు నమోదవ్వగా… మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. ఈ రోజు కొత్తగా కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 57కి చేరింది. అలాగే ప్రస్తుతం 650 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్కరోజే కరోనాతో 120 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. అంటే ఇప్పటివరకూ 1284 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 38 కేసులు నమోదయ్యాయి.

Read More:

మీరు వింటున్న ‘కరోనా కాలర్ ట్యూన్’ గొంతుక ఈమెదే

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్