AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: సినిమాలే కాదు..షుటింగ్స్ కూడా బంద్

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా జరిపిన సమావేశంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రేపటి (సోమవారం) నుంచి అన్ని షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని...

కరోనా ఎఫెక్ట్: సినిమాలే కాదు..షుటింగ్స్ కూడా బంద్
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2020 | 6:48 AM

Share

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా జరిపిన సమావేశంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రేపటి (సోమవారం) నుంచి అన్ని షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ తెలిపారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఫిల్మ్ చాంబర్ లో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ..24 విభాగాలతో సుదీర్ఘ సమావేశం తర్వాత సినిమా షూటింగ్స్ నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. షూటింగ్స్ లో చాలా మంది ఉంటారు. వాళ్ల ఆరోగ్యం దృష్ట్యా రేపటి నుంచి 31 వరకు సినిమాలు, టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్ తోపాటు ఇతర షూటింగ్స్ నిలిపివేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్చించి ఏకగ్రీవంగా ఈ ప్రకటన చేస్తున్నామని తెలిపారు. మార్చి 30న పరిస్థితులకనుగుణంగా మరోసారి సమావేశమై..తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్కులు, మాల్స్, పబ్ లు, స్టేడియంలు మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీలు ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ఠాగుర్ మధు, రామసత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.