AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్: తెలంగాణ రాజ్‌భవన్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తెలంగాణ రాజ్ భవన్‌ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఓ వ్యక్తికి కరోనా వచ్చి.. తగ్గినా కూడా.. ఇంకా చాలామందికి వైరస్ లక్షణాలు కనిపించడంతో..

కరోనా వైరస్: తెలంగాణ రాజ్‌భవన్ కీలక నిర్ణయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 11:01 AM

Share

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తెలంగాణ రాజ్ భవన్‌ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఓ వ్యక్తికి కరోనా వచ్చి.. తగ్గినా కూడా.. ఇంకా చాలామందికి వైరస్ లక్షణాలు కనిపించడంతో.. కేంద్ర ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాటిని తూచా తప్పకుండా ఫాలో చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగా.. తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం గవర్నర్‌కి సంబంధిచించిన కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

అలాగే ప్రజలు సమూహాలుగా ఉండొద్దని, బయట ఎక్కువగా తిరగరాదని ఆ శాఖ కోరింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే మళ్లీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశాలు మొదలయ్యేదీ ప్రస్తుతం చెప్పలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలకనుగుణంగానే తేదీలను నిర్ణయిస్తారని సమాచారం.

Read More this also: శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి!

‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి