AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు కేబినెట్‌ను వణికిస్తోన్న కరోనా.. మరో మంత్రికి పాజిటివ్..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ లక్షకు పైగా కరోనా..

తమిళనాడు కేబినెట్‌ను వణికిస్తోన్న కరోనా.. మరో మంత్రికి పాజిటివ్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2020 | 5:27 PM

Share

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సామాన్య ప్రజల నుంచి మొదలు.. రాష్ట్ర మంత్రుల వరకు అందర్నీ ఈ వైరస్ వణికిస్తోంది. తాజాగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూరు కె.రాజు కరోనా బారిన పడ్డారు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌గా రావడంతో.. ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వచ్చిన రిపోర్టులో ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే తమిళనాడులో ఇద్దరు మంత్రులు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రులే కాకుండా.. మరో 11 మంది ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది.