AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఈ రోజు కొత్త‌గా 5,967 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటు, తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు..

తమిళనాడులో ఈ రోజు కొత్త‌గా 5,967 కరోనా కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 6:36 PM

Share

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటు, తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వంద మందికిపైగా మరణిస్తున్నారు. తాజాగా బుధ‌వారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 116 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,61,435కు, మరణాల సంఖ్య 6,239కు చేరింది. కాగా, గత 24 గంటల్లో 6,384 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 2,96,171 మంది కోలుకోగా ప్రస్తుతం 53,155 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Read More:

సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి