సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ''వి'' సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇందుకు సంబంధించి బుధవారం ట్వీట్ చేశాడు నాని. ''థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇంట్లో అంటూ'' హీరో నాని అనౌన్స్ మెంట్ చేశారు. 'వి' చిత్రానికి సంబంధించి గురువారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు..
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ”వి” సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇందుకు సంబంధించి బుధవారం ట్వీట్ చేశాడు నాని. ”థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇంట్లో అంటూ” హీరో నాని అనౌన్స్ మెంట్ చేశారు. ‘వి’ చిత్రానికి సంబంధించి గురువారం కీలక ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించాడు. అన్నట్టుగానే ఈ రోజు సినిమా గురించి కొత్త అప్ డేట్ చేశాడు నాని. ఎట్టకేలకు వి మూవీ విడుదలకు సంబంధించిన సస్పెన్స్కు తెరదించాడు. ‘వి’ ఇంటికి వచ్చేస్తుంది. అని ఓటీటీలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
”సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తాజాగా ట్వీట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం ఇలా విడుదల కానుండటం కూడా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామంటూ” అభిమానులను ఉద్ధేశించి ఓ లేఖను షేర్ చేశాడు నాని. అలాగే ఈ మూవీ విడుదలకు సంబంధించి నివేదా థామస్ సైతం ట్వీట్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ‘వి’ సినిమాలో సుధీర్బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటించారు.
Read More:
నాతో పాటు నా కూతురికి కూడా కరోనా సోకిందిః మాళవిక
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి.. ప్రధాని మోదీ నివాళి
వచ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్’