షాకింగ్.. సూసైడ్‌ చేసుకున్న తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు.. కారణం ఇదేనా..?

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ మీటింగ్‌ల గురించి తెలిసిందే. తబ్లిఘీ జమాత్ ఇక్కడ మతపరమైన సమావేశం ఏర్పాటు చేయడంతో.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిద దేశాల నుంచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ తేలడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకు కారణం.. ఆ సమావేశానికి హాజరైన సభ్యులు.. వారి వారి స్వస్థలాలకు ప్రజా రవాణాలో వెళ్లడమే. అయితే వీరిలో కొందరికి ఈ కరోనా పాజిటివ్ ఉందన్న విషయం […]

షాకింగ్.. సూసైడ్‌ చేసుకున్న తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు.. కారణం ఇదేనా..?
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 4:44 PM

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ మీటింగ్‌ల గురించి తెలిసిందే. తబ్లిఘీ జమాత్ ఇక్కడ మతపరమైన సమావేశం ఏర్పాటు చేయడంతో.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిద దేశాల నుంచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ తేలడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకు కారణం.. ఆ సమావేశానికి హాజరైన సభ్యులు.. వారి వారి స్వస్థలాలకు ప్రజా రవాణాలో వెళ్లడమే. అయితే వీరిలో కొందరికి ఈ కరోనా పాజిటివ్ ఉందన్న విషయం తెలియడంతోనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. వెంటనే ఆ సమావేశాలకు వెళ్లిన వారి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో పలువురు తబ్లీఘీ సభ్యులు.. ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లారు. పలు మసీదుల్లో వీరి దొరకడంతో.. వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఓ తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు అకోలా ఆస్పత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం కరోనా టెస్టులు చేయడంతో.. అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో శనివారం ఉదయం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

కాగా..మృతుడు అసోం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. అయితే ఢిల్లీలో తబ్లీఘీ సమావేశాల అనంతరం.. మరో తబ్లీగీ సభ్యుడితో అకోలా ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది.