AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాలూకు నెగెటివ్‌.. అనుచరులకు పాజిటివ్‌..!

బీహార్‌ మాజీ సీఎం, ఆర్డేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే ఆయనకు సంబంధించిన ముగ్గురు అనుచరులకు మాత్రం పాజిటివ్‌గా..

లాలూకు నెగెటివ్‌.. అనుచరులకు పాజిటివ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 5:53 AM

Share

బీహార్‌ మాజీ సీఎం, ఆర్డేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే ఆయనకు సంబంధించిన ముగ్గురు అనుచరులకు మాత్రం పాజిటివ్‌గా తేలింది. అస్గర్, ఇర్ఫాన్, లక్ష్మణ్‌లకు గత కొద్ది రెండు మూడు రోజులుగా కరోనా లక్షణాలు కన్పించడంతో.. వెంటనే కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

మరోవైపు రాంచీలోని రిమ్స్‌లో లాలూకు గత కొద్ది రోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన వార్డుకు పక్కనే కరోనా వార్డు ఉంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లాలూ ప్రసాద్‌కు డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు మూత్రపిండాల సమస్యల‌ కూడా ఉన్నాయని.. వీటికి సంబంధించే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో లాలూకు కరోనా టెస్టులు నిర్వహించారు.

Follow Us