AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్ భవన్‌లో కరోనా కలకలం..2రోజుల పాటు ఢిల్లీ ప్రధాన కార్యాలయం మూసివేత

భారత్‌లో కరోనా కల్లోలం స‌ృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా, ఎవరిన్నీ వదలకుండా వెంటాడుతూనే ఉంది. తాజాగా..

రైల్ భవన్‌లో కరోనా కలకలం..2రోజుల పాటు ఢిల్లీ ప్రధాన కార్యాలయం మూసివేత
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2020 | 3:21 PM

Share

భారత్‌లో కరోనా కల్లోలం స‌ృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికీ పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా, ఎవరిన్నీ వదలకుండా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది.

ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయం రైల్వే భవన్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలువురు అధికారులకు కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయినట్లు రైల్వే భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో రైల్ భవన్‌ను రెండ్రోజుల పాటు మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళ, బుధవారం రెండు రోజులపాటు రైల్వే భవన్‌ను మూసివేసి పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని నిర్ణయించామని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ రెండు రోజులు అధికారులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తారని తెలిపింది. ఈ నెల 9, 10, 13 తేదీల్లో నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో రైల్వే బోర్డుకు చెందిన పలువురు అధికారులకు కొవిడ్ పాజటివ్ ఉన్నట్టు తేలిందని రైల్వే శాఖ ప్రకటించింది.

మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. 8 లక్షల కేసులను దాటిన మూడు రోజుల వ్యవధిలోనే దేశంలో మరో లక్ష కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోందంటూ పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది