నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..
నేడు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...
నేడు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రోజుల పాటు చర్చించనున్నారు.
కాగా మంగళవారం జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అధికారులతో మాట్లాడతారు మోదీ. పంజాబ్, గోవా, కేరళ, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంత అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఇక బుధవారం జరగబోయే వీడియో కాన్ఫరెన్స్లో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో సమావేశం కానున్నారు మోదీ. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై చర్చించనున్నారు.
Read More:
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..
బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..