AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓహో.. మోదీ జీ.. ఇందుకా.. 5వ తేదీ ఆ సమయాన్ని ఎంచుకుంది..!

ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా.. తన మార్క్‌ రాజకీయాన్ని చూపిస్తారు. పలు సందర్భాల్లో ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు.. దేశ ప్రజల్ని అంతా ఒక్కతాటి మీదకి తెచ్చేందుకేనంటారు కొందరు మోదీ అభిమానులు. ఇక ప్రస్తుతం దేశం కరోనా వైరస్‌ను నియంత్రించే పనిలో ఉంది. దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేందుకు మూడు వారాలపాటు (ఏప్రిల్ 14 వరకు) లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ చేపట్టిన […]

ఓహో.. మోదీ జీ.. ఇందుకా.. 5వ తేదీ ఆ సమయాన్ని ఎంచుకుంది..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 3:20 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా.. తన మార్క్‌ రాజకీయాన్ని చూపిస్తారు. పలు సందర్భాల్లో ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు.. దేశ ప్రజల్ని అంతా ఒక్కతాటి మీదకి తెచ్చేందుకేనంటారు కొందరు మోదీ అభిమానులు. ఇక ప్రస్తుతం దేశం కరోనా వైరస్‌ను నియంత్రించే పనిలో ఉంది. దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేందుకు మూడు వారాలపాటు (ఏప్రిల్ 14 వరకు) లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ చేపట్టిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు.. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ సంఘీభావంగా ఆ 22వ తేదీ సాయంత్రి దేశ వ్యాప్తంగా ఒకేసారి చప్పట్లు కొట్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం 9.00 గంటలకు మరోసారి దేశ ప్రజలనుద్దేశిస్తూ.. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం.. రాత్రి కరోనా చీకట్లను దేశం నుంచి తరిమికొట్టాలంటూ ఈ వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆర్పేయాలన్నారు. ఆ సమయంలో దీపాలు వెలిగించాలని.. అదే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేసి క్యాండిల్, దీపం, లేదా మొబైల్‌ ప్లాష్‌లైట్‌ వెలిగించాలన్నారు. ఈ విధంగా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు.. మరోసారి కరోనా మహమ్మారిని పారదోలేందుకు తమ సంకల్పం చాటాలన్నారు. ప్రజలు వెలిగించే ఈ కార్యక్రమంతో కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులు, ఎమర్జెన్సీ సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు.

ఇదంతా ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో మోదీ ఎంచుకున్న ఈ 5వ తేదీపై అనేక అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజుతో ఎన్నో అంశాలను ముడిపెడుతున్నారు. ప్రధాని న్యూమరాలజీని పాటిస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఆ ప్రకారమే శుక్రవారం ఉదయం 9.00 గంటలకు బయటకు వచ్చారని.. ఇక ఏప్రిల్ 5వ తేదీ కూడా.. మొత్తం కూడితే 9 వస్తుందని (5+ఏప్రిల్ 4వ నెల).. అంతేకాకుండా 5+2+0+2+0=9( తేదీ+సంవత్సరం) కూడితే మొత్తం 9 వస్తుందంటూ లెక్కలు గడుతున్నారు. ఇక 5వ తేదీ నాటికి లాక్‌డౌన్ ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంటుందని..మరో లెక్క చెబుతున్నారు. ఇక ఆ రోజు రాత్రి 9.00 గంటల నుంచి 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పివేయాలని చెప్పడం.. అది కూడా మొత్తం 9 కావడం ఇలా అనేక ఉదాహరణలు చెప్తూ.. సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేసేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ.. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, నిత్యం ఎమర్జెన్సీ అవసరాలకు పోరాడుతున్న యంత్రాంగానికి మరింత స్పూర్తినింపడం అనేది ఎంతో ముఖ్యం.