AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ-లూథియానా విమానంలో ఒకరికి కరోనా పాజిటివ్

విమాన ప్రయాణికులకు సమగ్ర కరోనా స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయని, తమకు కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాన్ని వారు  నింపి ఇవ్వాలని, పైగా ఆరోగ్య సేతు యాప్ లో సదరు ప్రయాణికులకు  అసలు ఆ పాజిటివ్ లక్షణాలు లేవని తేలితేనే విమానం ఎక్కేందుకు..

ఢిల్లీ-లూథియానా విమానంలో ఒకరికి కరోనా పాజిటివ్
Umakanth Rao
| Edited By: |

Updated on: May 27, 2020 | 7:10 PM

Share

విమాన ప్రయాణికులకు సమగ్ర కరోనా స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయని, తమకు కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాన్ని వారు  నింపి ఇవ్వాలని, పైగా ఆరోగ్య సేతు యాప్ లో సదరు ప్రయాణికులకు  అసలు ఆ పాజిటివ్ లక్షణాలు లేవని తేలితేనే విమానం ఎక్కేందుకు అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ, ఎయిర్ లైన్స్ వర్గాలు తమ మార్గదర్శక సూత్రాల్లో పదేపదే పేర్కొన్నాయి. . కానీ అవి బూటకంగా కనిపిస్తున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిన్న ఢిల్లీ-లూథియానా ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలింది. దీంతో  పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం..36 మంది ప్రయాణికులను, నలుగురు విమాన సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు. అలయెన్స్ ఎయిర్ సంస్థలో సెక్యూరిటీ విభాగంలో పని చేసే ఈ వ్యక్తి.. పెయిడ్ టికెట్ పై ప్రయాణిస్తున్నాడట. అలాగే ఈ నెల 25 న చెన్నై నుంచి కోయంబత్తూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో కూడా ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలియడంతో ఆ ఎయిర్ లైన్స్ సంస్థ మొత్తం సిబ్బందినంతటినీ 14 రోజుల క్వారంటైన్ కి షిఫ్ట్ చేసింది. ఆ ప్యాసింజర్ తనకు తాను కోయంబత్తూరులోని ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో ప్రత్యేక క్వారంటైన్ వార్డులో చేరాడట. ఇలా విమాన ప్రయాణికుల్లోనూ కరోనా సోకిన వ్యక్తులు బయటపడడంతో ఎయిర్ లైన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ