వరుస వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న  రుక్మిణి వసంత్ 

09 August   2026

Pic credit - Instagram

Rajeev 

కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భామ రుక్మిణి వసంత్.. ప్రస్తుతం వరుస సినిమాతో దూసుకుపోతుంది.

2019లో వచ్చిన కన్నడ చిత్రం బీర్బల్ తో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే మెప్పించింది. 

అదే సమయంలో అప్ స్టైర్స్ అనే హిందీ చిత్రంలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ.రుక్మిణి కెరీర్‌లో అసలు మలుపు 2023లో వచ్చింది.

రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన సప్తసాగరాలు దాటి సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాంతారా చాప్టర్‌ 1’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. నిఖిల్‌ సిద్ధార్థ్‌తో కలిసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 

ప్రస్తుతం ఈ అమ్మడు యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తుంది రుక్మిణి ఇలా వరుస సినిమాతో దూసుకుపోతుంది.