Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో కరోనా విలయ తాండవం..

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ 85 మార్క్‌ను దాటి.. లక్షకు చేరువలో ఉంది.

పాక్‌లో కరోనా విలయ తాండవం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 04, 2020 | 9:13 PM

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ 85 మార్క్‌ను దాటి.. లక్షకు చేరువలో ఉంది. మొన్నటి వరకు అక్కడ కరోనా కేసులు అత్యల్పంగా నమోదైనప్పటికీ.. అక్కడి ఇమ్రాన్ సర్కార్.. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా మరో 4,688 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,264కి చేరింది. దీంతో కరోనా పురుడు పోసుకున్న దేశాన్ని దాటేసింది. చైనాలో 84,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే.. ఒక్క రోజులోనే ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక మరణాల సంఖ్య కూడా రెండు వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే 1,770 మంది కరోనా బారినపడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 30 వేల మందికి పైగా కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాక్‌లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌, పంజాబ్ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి.