AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోని జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే…

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి.. పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించాలని తెలిపింది.  ప్రశ్నాపత్రంలో మార్పులు చేసి ఎక్కువగా ఐచ్చికాలను ఇవ్వాలని వెల్లడించింది. అయితే క్వశ్చన్ పేపర్ పాటర్న్ చేంజ్ విషయం మాత్రం వర్సిటీలదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిగ్రీ, పీజీ […]

తెలంగాణలోని జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే...
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 9:12 AM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షలను నిర్వహించేందుకు యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి..

  • పరీక్షా సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించాలని తెలిపింది.
  •  ప్రశ్నాపత్రంలో మార్పులు చేసి ఎక్కువగా ఐచ్చికాలను ఇవ్వాలని వెల్లడించింది. అయితే క్వశ్చన్ పేపర్ పాటర్న్ చేంజ్ విషయం మాత్రం వర్సిటీలదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది.
  • ప్రస్తుతం డిగ్రీ, పీజీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులకు జూన్ 20 నుంచి బ్యాక్‌లాగ్స్‌తో సహా ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది.
  • మిగిలిన్ సెమిస్టర్లు కాలేజీల రీ-ఓపెన్ తర్వాత గానీ, నవంబర్ లేదా డిసెంబర్‌లో గానీ నిర్వహించాలని సూచించింది.
  • బ్యాక్‌లాగ్స్‌తో సంబంధం లేకుండా విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని స్పష్టం చేసింది.
  • ప్రాజెక్టులు, సెమినార్స్, వైవాలు అన్ని కూడా ఆన్లైన్‌లోనే నిర్వహించాలంది.
  • ప్రాక్టికల్స్ నిర్వహణ విషయం మాత్రం ఆయా కాలేజీల ఇష్టమని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Also Read: జగన్ సర్కార్ సంచలనం.. పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గింపు..