AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భారతం… దేశంలో 5 వేలకు చేరువైన మరణాలు..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ విధిస్తున్నప్పటికీ మహమ్మారి కంట్రోల్ కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,73, 763 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4971 మంది చనిపోయారు. ప్రస్తుతం 86,422 యాక్టివ్ కేసులు ఉండగా.. సుమారు 82,370 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… అండమాన్ నికోబార్ ఐలాండ్స్- 33, ఆంధ్రప్రదేశ్- […]

కరోనా భారతం... దేశంలో 5 వేలకు చేరువైన మరణాలు..
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 10:00 AM

Share

దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ విధిస్తున్నప్పటికీ మహమ్మారి కంట్రోల్ కావట్లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,73, 763 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4971 మంది చనిపోయారు. ప్రస్తుతం 86,422 యాక్టివ్ కేసులు ఉండగా.. సుమారు 82,370 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… అండమాన్ నికోబార్ ఐలాండ్స్- 33, ఆంధ్రప్రదేశ్- 3436, అరుణాచల్ ప్రదేశ్ – 3, అస్సాం- 1024, బీహార్- 3376, చండీగర్- 289, ఛత్తీస్గఢ్- 415, దాదర్ నగర్ హవేలీ- 2, ఢిల్లీ- 17,386, గోవా- 69, గుజరాత్- 15,934, హర్యానా- 1721, హిమాచల్ ప్రదేశ్- 295, జమ్మూకాశ్మీర్- 2164, ఝార్ఖండ్- 511, కర్ణాటక- 2781, కేరళ- 1150, లడఖ్- 74, మధ్యప్రదేశ్- 7645, మహారాష్ట్ర- 62,228, మణిపూర్ – 59, మేఘాలయ- 27, మిజోరాం- 1, నాగాలాండ్- 25, ఒడిశా- 1723, పుదుచ్చేరి- 51, పంజాబ్- 2197, రాజస్తాన్- 8365, సిక్కిం – 1, తమిళనాడు- 20,246, తెలంగాణ- 2425, త్రిపుర- 251, ఉత్తరాఖండ్- 716, ఉత్తరప్రదేశ్- 7284, పశ్చిమ బెంగాల్- 4813 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

Also Read: తెలంగాణలోని జూన్ 20 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే…